News March 29, 2025

బాపట్ల: యువకులను కాపాడిన పోలీసులు

image

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న యువకులను పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం మేరకు.. నల్గొండ జిల్లాకు చెందిన చిన్న, శ్రీనులు శనివారం బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి మునిగిపోతుండగా స్థానికులు కేకలు వేయటంతో వెంటనే పోలీసులు కొట్టుకుపోతున్న వారిని కాపాడారు.

Similar News

News April 1, 2025

నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

News April 1, 2025

అలంపూర్: ‘నిర్లక్ష్యానికి నిదర్శనం ప్రభుత్వ వైద్యశాల’

image

అలంపూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో కనీస రోగులకు అందించే మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. అలంపూర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన పలువురు కుక్క కాటుకు గురయ్యారు. ఈ క్రమంలో వైద్యశాలకు వెళితే కుక్కకాటుకు మందు వైద్యశాలలో లేదని పక్క రాష్ట్రమైన కర్నూల్‌కి వెళ్లాలని వైద్యులు సూచించారని రోగులు ఆరోపిస్తున్నారు. కనీసం మందులు లేకుంటే ఎట్లా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు?

News April 1, 2025

నారాయణపేట: సెంట్రల్ GOVT జాబ్ కొట్టాడు..!

image

నారాయణపేట మండల పరిధిలోని కందేన్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు బోయిని రఘువర్ధన్ ఇండియన్ నేవీ ఆర్మీ జాబ్ సాధించాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి జాబ్ సాధించాడు. నేవి జాబ్ సాధించిన రఘువర్ధన్‌కు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!