News March 19, 2025

బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

image

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 20, 2026

పల్వంచ: రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల

image

రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పల్వంచకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ ఫామ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

News February 20, 2026

భారీ జీతంతో RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

RITES లిమిటెడ్‌ 3 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్, MA/MSc/ఎన్విరాన్‌మెంట్ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ లీడర్‌కు నెలకు రూ.3లక్షలు, సేఫ్టీ, హెల్త్& ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌కు నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. మార్చి 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News February 20, 2026

ఉట్నూర్: కట్టెల మోపుల కింద నలిగిపోతున్న బాల్యం

image

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండలంలోని ఓ గ్రామంలో బాల్యంపై బాధ్యతల భారం ఇలా కనిపించింది. మండుతున్న ఎండలో చిన్నారులు తలపై కట్టెల మోసుకుంటూ నడుస్తున్నారు. కుటుంబానికి ఇంధనం సమకూర్చేందుకు బాల్యాన్ని భుజాన వేసుకున్న ఈ దృశ్యం హృదయాలను కదిలిస్తోంది. పాఠశాలకు వెళ్లే వయసులో బాధ్యతలు మోస్తున్న ఈ చిన్నారుల కష్టజీవితం గ్రామీణ వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తోంది. జీవనాధారం కోసం వారి ప్రతి అడుగు పోరాటమే.