News September 6, 2025
బాపట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన బాపట్ల మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొండుబోట్లపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 7, 2025
అన్నమయ్య: ఓ ఇంటిలోకి దూసుకెళ్లిన కారు

అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లెలో కారు బీభత్సం సృష్టించింది. హార్సిలీహిల్స్కు వెళ్తున్న కారు ఆదివారం కురబలకోట మండలం కంటేవారిపల్లెలో అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. పలమనేరుకు చెందిన కొందరు యువకులు కారులో హార్సిలీహిల్స్కు బయలుదేరారు. కారు మార్గమధ్యంలో మండలంలోని కంటేవారిపల్లెలోని మనోహర్ అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు, బైక్, మట్టి కుండలు ధ్వంసమయ్యాయి.
News September 7, 2025
జపాన్ పీఎం ఇషిబా రాజీనామా?

జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయనున్నారు. అధికార LDPలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ NHK తెలిపింది. దీనిపై ఇవాళ సాయంత్రం 6 గంటలకు PM ప్రెస్మీట్ నిర్వహిస్తారని పేర్కొంది. జులైలో జరిగిన హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ (అప్పర్ హౌస్) ఎన్నికల్లో LDP, మిత్రపక్షం కొమైటో మెజారిటీ కోల్పోయింది. దీంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది.
News September 7, 2025
వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి: ఎస్పీ

వినాయక చవితి వేడుకలు, మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు జిల్లాలో శాంతియుతంగా జరిగాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ పండుగలు మత సామరస్యాన్ని చాటి చెప్పాయన్నారు. విజయవంతంగా వేడుకలు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. సహకరించిన కమిటీలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.