News November 28, 2025
బాపట్ల: వికటించిన నాటువైద్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి

మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని(16) నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న బాలికకు, స్థానికుల సలహాతో ‘కొండపిండి ఆకు’ తినిపించారు. నాటు మందు కారణంగా కడుపునొప్పి తీవ్రమవ్వడంతో వెంటనే గుంటూరు GGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున బాలిక మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News December 1, 2025
NGKL: పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం పూజలు

జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ పట్టణంలోని పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట ప్రత్యేకంగా అర్చన చేసి ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు జూపల్లి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News December 1, 2025
NGKL: సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటన, ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


