News March 6, 2026

బాపట్ల: స్కూల్‌లో అలజడి.. HMపై కులవివక్ష ఆరోపణలు

image

కర్లపాలెం మండలంలోని పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ పట్ల కుల వివక్ష చూపుతున్నారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ వివాదం ముదరడంతో విషయం శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2026

మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

image

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్‌ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.

News March 10, 2026

కొయ్యలగూడెం: ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు

image

ఎన్ఎల్ఎస్ పరిధిలో వర్జీనియా పొగాకు వేలం కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు వేలం నిర్వహణ అధికారి శివకుమార్ తెలిపారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం1,2, దేవరపల్లి, గోపాలపురంలోని ఐదు కేంద్రాల్లో వేలం జరుగుతుందన్నారు. సుమారు 4,816 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్న 2,673 మంది రిజిస్టర్డ్ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.

News March 10, 2026

గల్ఫ్ యుద్ధం.. నిజామాబాద్ వాసికి గాయాలు

image

గల్ఫ్ యుద్ధం కారణంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి గాయపడ్డారు. కమ్మర్‌పల్లికి చెందిన తిరుపతి ఉపాధి నిమిత్తం ఏడేళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇటీవల ఆయన విధుల్లో ఉండగా మిస్సైల్ దాడిలో శకలాలు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.