News March 18, 2025
బాపట్ల: 44 కేంద్రాలలో ఫ్లైయింగ్ స్క్వాడ్ల తనిఖీలు

బాపట్ల జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో జిల్లా వ్యాప్తంగా 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు ద్వారా 103 కేంద్రాలలో 44 పరీక్ష కేంద్రాలలో తనిఖీలు నిర్వహించామని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ప్రకటించారు. పరీక్షలకు మొత్తం 16,481 మంది విద్యార్థులకు గాను16,247 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News March 18, 2025
ఆదిలాబాద్: ఎండల నేపథ్యంలో హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు

ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. దింతో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. 7670904306 సెల్ నంబర్ను అందుబాటులో ఉంచారు. ప్రజలు ఏమైనా సమాచారం కోసం సంప్రదించాలన్నారు.
News March 18, 2025
పిటిషనర్కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.కోటి జరిమానా

TG: హైకోర్టును తప్పు దోవ పట్టించాలని చూసిన ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్లో ఉంచిన విషయాన్ని దాచి వేరే బెంచ్లో ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సీరియస్ అయ్యారు. హైకోర్టును తప్పు దోవ పట్టించేలా పిటిషన్ వేసినందుకు రూ.కోటి జరిమానా విధించారు. దీంతో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలన్న పిటిషనర్కు కోర్టు చెక్ పెట్టింది.
News March 18, 2025
ఎచ్చెర్లలో భార్య హత్య .. లొంగిపోయిన భర్త

ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన గాలి నాగమ్మ (45)ను ఆమె భర్త గాలి అప్పలరెడ్డి సోమవారం రాత్రి కత్తితో నరికి హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం భార్యభర్తలిద్దరూ కలిసి ఉదయం కూలి పనికెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త కత్తితో హత్య చేశాడు. అనంతరం అప్పలరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.ఘర్షణకు కారణం తెలియాలి.