News October 20, 2025

బాపట్ల: GST ముగింపు సమావేశంలో కలెక్టర్ ఫ్యామిలీ

image

బాపట్ల టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ ముగింపు సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ ఆయన సతీమణి భూమిక చంద్రలాలి పాల్గొన్నారు. సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు చేపట్టిందన్నారు. జీఎస్టీ 4 స్లాబ్‌లు ఉన్న విధానాన్ని 2 స్లాబ్‌లకు తీసుకురావడంజరిగిందన్నారు.

Similar News

News October 20, 2025

జనగామ: మద్యం టెండర్ల దాఖలకు గడువు పొడిగింపు

image

మద్యం టెండర్ల దాఖలుకు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అనిత తెలిపారు. జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 1,600 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.

News October 20, 2025

మంచిర్యాల: పండగపూట భార్యను చంపిన భర్త

image

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద గృహిణి హత్యకు గురైంది. ఆమె భర్త కుమార్ గొంతు నులిమి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News October 20, 2025

VKB: అనంతపద్మనాభ స్వామి ఆలయం మూసివేత

image

వికారాబాద్‌కు సమీపంలోని మహిమాన్విత అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అమావాస్యను పురస్కరించుకుని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఆలయ మేనేజర్ నరేందర్ తెలిపారు. నిత్యం భక్తులు సందర్శించి, మొక్కులు తీర్చుకునే ఈ ఆలయాన్ని అమావాస్య ముగిసిన తర్వాత శుద్ధి చేసి తిరిగి తెరుస్తామని ఆయన వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.