News February 17, 2025

బాలికతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు: ఎస్‌ఐ

image

నూజివీడులో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై వరసకు అన్నదమ్ములు అయ్యే ఇద్దరు మైనర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జ్యోతిబాసు తెలిపారు. గత రాత్రి ట్యూషన్‌కు వెళ్తున్న బాలికపై ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారన్నారు. బాలిక వారి నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News July 6, 2025

NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

image

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.

News July 6, 2025

చిత్తూరు: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

News July 6, 2025

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి చెందిన ఘటన <<16957129>>కట్టంగూరులో <<>>జరిగింది. శాలిగౌరారం(M)ఊట్కూరుకు చెందిన పిట్టల శంకరమ్మ, ఆమెకుమారుడు రజనీకాంత్‌ HYDలో నివాసం ఉంటున్నారు. నకిరేకల్‌(M) ఓగోడులో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి బైక్‌‌పై HYD బయలుదేరారు. KTNG బిల్లంకానిగూడెం సమీపంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో రజనీకాంత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన శంకరమ్మ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.