News January 25, 2025
బాల్కొండ: ఎన్నికల కోసమే రైతుబంధు: MLA

ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. BRS ఆధ్వర్యంలో సాగు, సంక్షేమ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, MLCలు యాదవరెడ్డి, కోటిరెడ్డి, మెండోరా మండలం బుస్సాపూర్లో రైతులతో శనివారం సమావేశమయ్యారు.
Similar News
News February 14, 2026
దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.
News February 14, 2026
NZB: మేయర్ పీఠం కోసం వారి ఓట్లే కీలకం

NZB నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇందు కోసం MP, MLA, MLCలు తమకు ఓటు ఉన్న జిల్లా పరిధిలో ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటరుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. దీంతో BJPకి చెందిన MP, NZB(U), ARMR MLAలతో పాటు ఇద్దరు MLCలు, కాంగ్రెస్కు చెందిన NZB(R), BDN MLAలతో పాటు జిల్లాకు చెందిన MLC మహేశ్ కుమార్ గౌడ్ ఓట్లు నమోదు చేసుకోనున్నారు.
News February 14, 2026
NZB: 18 నుంచి 14కు తగ్గిన MIM సీట్లు

2020లో నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకున్న AIMIM 2026 ఎన్నికల్లో 14 సీట్లను గెలుచుకుంది. AIMIM అభ్యర్థులు పోటీ చేసిన కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత పాలక వర్గంలో ఉన్న షకీల్ హైమద్, మహ్మద్ ఇద్రీస్ ఖాన్లు వరుసగా 52, 55వ డివిజన్లలో గెలుపొందడం గమనార్హం.


