News March 20, 2024
బాల్కొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం <<12887148>>అర్ధరాత్రి <<>>జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు బైకులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మృతులు వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన పఠాని రిషి, ముప్కాల్కు చెందిన ఉద్ధవ్గా పోలీసులు గుర్తించారు.
Similar News
News December 14, 2025
నిజామాబాద్ జిల్లాలో 20.49 శాతం పోలింగ్

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన రెండు గంటల్లో ఉదయం 9 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1081WM లకు 20.49 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ధర్పల్లి మండలంలో 20.99%,
*డిచ్పల్లి -13.52%
*ఇందల్ వాయి- 19.95%
*జక్రాన్ పల్లి- 23%
*మాక్లూర్-22.31%
*మోపాల్- 19.43%
*NZB రూరల్- 26.69%
*సిరికొండ-23.24% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.
News December 14, 2025
NZB: రెండో విడతకు అధికారులు ఎంత మందో తెలుసా?

NZBజిల్లాలో 2వ విడతలో ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. మొత్తం 2,38,838 మంది ఓటర్లు ఉండగా 1,476 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీవోలు 1,476 మంది, ఓపీవోలు 1937, మైక్రో అబ్జర్వర్లు 56, జోనల్ అధికారులు 34 మంది విధుల్లో ఉంటారు. సిబ్బంది తరలింపునకు 53 రూట్లు కేటాయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.
News December 14, 2025
చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.


