News February 12, 2026
బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Similar News
News February 25, 2026
ప్రధాని మోదీ అరుదైన ఘనత

ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ పార్లమెంటు(క్నెసెట్)లో ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఇరు దేశాల నేతలు ఏఐ, ట్రేడ్, టెక్నాలజీ, డిఫెన్స్ మొదలైన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూదుల ఊచకోతకు స్మారకంగా నిలిచిన యద్ వషెంను మోదీ రేపు సందర్శిస్తారు.
News February 25, 2026
జులైకి నల్లమల సాగర్ పూర్తి చేస్తాం: CBN

AP: 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ‘గోదావరి నుంచి 6 వేల టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణా డెల్టా నుంచి నల్లమల సాగర్కు తీసుకొస్తాం. జులైకి నల్లమల సాగర్ను పూర్తి చేస్తాం’ అని మార్కాపురం సభలో ప్రకటించారు.
News February 25, 2026
FSLలో ఉద్యోగాలు.. రేపటి నుంచి హాల్టికెట్లు

TG: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల పరీక్షల హాల్టికెట్లు రేపు రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి మార్చి 4 అర్ధరాత్రి 12 గంటల వరకు <


