News July 5, 2025

బావాజీపాలెంలో యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నిజాంపట్నం మండలం బావాజీపాలెంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతిరావు వివరాల మేరకు.. ఆముదాలపల్లికి చెందిన మణికంఠ కృష్ణ కుమార్(24) తెనాలి నుంచి ఆముదాలపల్లికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో బావాజీపాలెం దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Similar News

News July 5, 2025

చేయూతను అందించడమే పీ4 లక్ష్యం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమంపై శుక్రవారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గ్రామాల్లో 10% మార్గదర్శులను, దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాలను ఎంచుకుని వారికి పీ4 ఉద్దేశ్యం వివరించాలన్నారు. దిగువ స్థాయి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక బాధ్యత కింద చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

News July 5, 2025

SUPER.. టాప్ 5లో జగిత్యాల విద్యార్థినికి చోటు

image

బాసర, MBNR IIITల్లో JGTL జిల్లా నుంచి 66 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 1,690 సీట్లకు గాను జిల్లా నుంచి విద్యార్థిని వర్షిణి టాప్ 5లో ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు. అలాగే ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అటెండ్ కానివారు తమకు కేటాయించిన సీట్లు కోల్పోయే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.

News July 5, 2025

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య..!

image

విజయవాడ అయోధ్య నగర్‌లోని క్షత్రియ భవన్‌లో ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు. సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.