News September 9, 2025

బాసర ఆర్జీయూకేటీలో పట్టభద్రుల యోగ్యత శిక్షణ గేట్ తరగతులు ప్రారంభం

image

యంత్రశాస్త్ర పోటీ పరీక్షల సాధనా పరిషత్(ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ) సహకారంతో యంత్రశాస్త్ర పట్టభద్రుల యోగ్యతా పరీక్ష(గేట్))అంతర్జాల శిక్షణా తరగతులను బాసర ఆర్జీయూకేటీలో కళాశాల వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మాణాత్మక గేట్ శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఏ.సీ.ఈ అకాడమీ ఒక విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారన్నారు.

Similar News

News September 9, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: జాయింట్ కలెక్టర్

image

యూరియా ఎరుకుల కోసం రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్‌తో కలిసి ఎరువుల పరిస్థితి పరిశీలించారు. రైతులు మంచి ప్రయోజనాలు కలిగిన నానో యూరియాను వినియోగించాలని కోరారు. రైతులు సాగుచేసిన పంటల వివరాలు ధాన్యం కొనుగోళ్లపై కూడా మాట్లాడినట్లు మండల వ్యవసాయ అధికారి మురళీధర్ తెలిపారు.

News September 9, 2025

తాడేపల్లిలో రేపు జగన్ మీడియా సమావేశం

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూముల దోపిడీ వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

News September 9, 2025

విద్యార్థి సమస్యలపై సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ ఉండాలి: కలెక్టర్

image

అమలాపురం కలెక్టరేట్ భవన్‌లో మంగళవారం ఆర్‌ఎస్‌యూ స్టూడెంట్ యూనియన్ పదవ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంటేపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఎప్పటికప్పుడు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థి సంఘాలు సమాజ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.