News December 13, 2025

బాసర మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

image

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు బాసర రైల్వే మేనేజర్ రవీందర్ తెలిపారు. బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, తదితర స్టేషన్‌ల మీదుగా రైలు నంబర్‌ 07274 మచిలిపట్నం – అజ్మీర్‌ డిసెంబర్ 21న, 07275 అజ్మీర్‌-మచిలీపట్నం- మీదుగా డిసెంబర్ 28న రైళ్లను నడుపుతున్నట్లు మేనేజర్ తెలిపారు.

Similar News

News December 15, 2025

గోదాదేవి రచించిన పాశురాల గురించి తెలుసా?

image

దైవారాధనకు కఠిన దీక్షలు అవసరం లేదని, స్వచ్ఛమైన ప్రేమతో కూడా దేవుడిని వశం చేసుకోవచ్చని గోదాదేవి నిరూపించింది. ఆమె అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి కృష్ణుడిని భర్తగా పొందింది. తాను ధరించిన పూల మాలను కృష్ణుడికి సమర్పించింది. ఆమె రచించిన 30 పాశురాలనే ‘తిరుప్పావై’ అంటారు. పెళ్లికాని యువతులు రోజుకొకటి చొప్పున 30 పాశురాలు ఆలపిస్తే సద్గుణాల భర్త వస్తాడట. రేపటి నుంచి భక్తి కేటగిరీలో పాశురాలను చూడొచ్చు.

News December 15, 2025

కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.

News December 15, 2025

త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన: మహేశ్ గౌడ్

image

TG: త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల మార్పు, చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్, అధిష్ఠానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక అని చెప్పారు.