News March 10, 2026

బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు: ఏసీబీ డీఎస్పీ

image

అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పలువురి ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్లానింగ్ రూల్స్, డాక్యుమెంట్స్ ప్రకారం బిల్డింగ్స్ కట్టారా, లేదా అని రేపు ఫీల్డ్ విచారణ చేపడతామన్నారు.

Similar News

News April 6, 2026

నేడు అనంతలో సీఎం పర్యటన.. సాగునీటి భద్రతపై రైతులతో చర్చ

image

జిల్లాలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించనున్నారు. యాడికిలో ‘సాగునీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు. హంద్రీనీవా కాలువ ప్రయోజనాలు, నీటి నిర్వహణపై చర్చించి, సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికను అందించనున్నారు. పెండేకల్లు రిజర్వాయర్ వద్ద ‘హాఫ్ మూన్’ వ్యవసాయ విధానాన్ని పరిశీలించనున్నారు. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

News April 6, 2026

నేడు అనంతలో సీఎం పర్యటన.. సాగునీటి భద్రతపై రైతులతో చర్చ

image

జిల్లాలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించనున్నారు. యాడికిలో ‘సాగునీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు. హంద్రీనీవా కాలువ ప్రయోజనాలు, నీటి నిర్వహణపై చర్చించి, సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికను అందించనున్నారు. పెండేకల్లు రిజర్వాయర్ వద్ద ‘హాఫ్ మూన్’ వ్యవసాయ విధానాన్ని పరిశీలించనున్నారు. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

News April 6, 2026

పోలీస్ PGRS రద్దు: అనంతపురం ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన పోలీస్ PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా పోలీస్ PGRS కార్యక్రమానికి అర్జీదారులు ఎవరూ రాకూడదని సూచించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా బందోబస్తు, విధుల దృష్ట్యా PGRSను రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.