News March 25, 2024
బీఆర్ఎస్, కాంగ్రెస్వి అబద్ధపు ప్రచారాలు

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.
Similar News
News February 3, 2026
NLG: నా ప్రాణం.. చివరి శ్వాస వరకు మీకోసమే: మంత్రి కోమటిరెడ్డి

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున హోరెత్తించారు. నల్లగొండ తన ఇల్లు, ప్రాణం అని పేర్కొంటూ ప్రజలతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే తన చివరి శ్వాస వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను అభ్యర్థించారు.
News February 3, 2026
నల్లగొండ: పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా సాగుతోంది. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకులు జి.రమేష్ సమక్షంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ రెండో విడత ర్యాండమైజేషన్ను పూర్తి చేశారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని 162 వార్డులు, 475 పోలింగ్ కేంద్రాలకు గాను.. 20 శాతం రిజర్వుతో కలిపి మొత్తం 1713 మంది సిబ్బందిని కేటాయించారు.
News February 3, 2026
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వ్యూహం.. గెలుపే లక్ష్యం!

నల్లగొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మనోరమ హోటల్లో 13వ డివిజన్ ముఖ్య నాయకులతో భేటీ కాగా, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. అభ్యర్థి జానికి మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించేలా కార్యకర్తలు ఐక్యంగా కష్టపడాలని మంత్రి పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయాలు వేడెక్కాయి.


