News February 25, 2025
బీఆర్ఎస్ స్కాంలన్నీ సీబీఐకి అప్పగించండి: బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పైకి తిడుతున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు స్కాంలపై మాట్లాడిన వాఖ్యలు చూస్తే ఆయన సీఎంగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తుందన్నారు. బీఆర్ఎస్ స్కాంలను సిబిఐకి అప్పగించాలనన్నారు.
Similar News
News February 25, 2025
జడ్చర్ల: ఆటో, బైక్ ఢీ.. యువకుడికి గాయాలు

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. నసురుల్లాబాద్ శివారులోని మూలమలుపు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2025
బయో ఏషియా సదస్సును ప్రారంభించిన సీఎం

TG: హైదరాబాద్లో బయో ఏషియా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాట్రిక్సన్కు జినోమ్ వ్యాలీ ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు. నానో టెక్నాలజీ సాయంతో వైద్యరంగంలో సరికొత్త విధానాలకు ఆస్కారం ఉందని ఆమె అన్నారు. పరిశోధన రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, జినోమ్ థెరపీతో అనేక వ్యాధులకు చికిత్స సులభం అవుతుందని చెప్పారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
News February 25, 2025
సిద్దిపేట: దంచి కొడుతున్న ఎండ

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో కనిపించే ఎండ ప్రభావం ఈ ఏడాది ముందుగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.