News August 13, 2024

బీఆర్ఎస్ హాయంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు: మంత్రి ఉత్తమ్

image

బీఆర్‌ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు 39% మాత్రమే పూర్తయ్యాయని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్ల సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ హాయాంలో 90% ప్రాజెక్టు పూర్తి చేశామని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.

Similar News

News January 29, 2026

సూర్యాపేట: హస్తం పార్టీలో టికెట్ల లొల్లి

image

SRPT మున్సిపాలిటీలో కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తారు. 48 వార్డులకు 600 దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులు ఉంటారని భావించినా, భారీగా అప్లికేషన్లు రావడంతో హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఉత్తమ్, సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీ అభ్యర్థుల వడపోత పూర్తి చేసిన తర్వాతే బీ-ఫామ్ అందజేయనున్నారు.

News January 29, 2026

NLG: కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి నేపథ్యం ఇదే..

image

NLG కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్యను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి మేయర్ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశారు.
పేరు: బుర్రి చైతన్య
భర్త: శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్
కుమారులు: ఇద్దరు
తల్లిదండ్రులు: బండ సరోజ, అంజిరెడ్డి
పదవులు: 2011 నుంచి 2018 వరకు రామాలయం ఛైర్మన్‌గా, 2020 నుంచి 2025 వరకు 33వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.

News January 29, 2026

నల్గొండ: మున్సిపల్ పోరు.. తొలిరోజే 44 నామినేషన్లు

image

నల్గొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. 162 వార్డులకు గాను తొలిరోజైన బుధవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 16, కాంగ్రెస్ 14, బీజేపీ 9 నామినేషన్లు రాగా, స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. నల్గొండలో అత్యధికంగా 11 మంది దరఖాస్తు చేయగా, హాలియాలో బోణీ కాలేదు. ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.