News April 14, 2024

బీఎస్పీ చేవెళ్ల అభ్యర్థిగా మీర్ మహమ్మద్ అలీ..?

image

చేవెళ్ల లోక్‌సభ బరిలో ఉండాలని బీఎస్పీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు, ముస్లిం మైనార్టీ నాయకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పరిగికి చెందిన మీర్ మహమ్మద్ అలీ ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనతో చర్చలు జరిపిన BSP నేతలు త్వరలో నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.

Similar News

News October 11, 2024

ఆయుధ పూజలో చేసిన స్పీకర్

image

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నివాసంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ప్రజలకు స్పీకర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూజలో చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పామెన భీమ్ భరత్ ఓఎస్‌డీ వెంకటేశం, రఘుపతి రెడ్డి, నవాబ్‌పేట్ మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News October 11, 2024

HYD: అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎంకు ఆహ్వానం

image

గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి శుక్రవారం CM రేవంత్ రెడ్డిని అలయ్ బలయ్‌కు ఆహ్వానం అందించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 13న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

News October 11, 2024

HYD: CM రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలి: చెన్నయ్య

image

ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్‌తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.