News October 4, 2025

బీచ్‌లను సుందరంగా తీర్చిదిద్దండి: జీవీఎంసీ కమిషనర్

image

విశాఖలో త్వరలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్, ఐఎఫ్ఆర్ దృష్ట్యా బీచ్‌లను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కాలువల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేందుకు కాలువల వద్ద వెంటనే స్క్రీన్లు, ఆధునిక వలలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.

Similar News

News October 5, 2025

ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి: కలెక్టర్

image

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 46 కేసుల్లో బాధితులకు రూ.79 లక్షల పరిహారం అందించామని, పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబాలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు.

News October 5, 2025

విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

image

కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. 5న రాత్రి విశాఖ చేరుకొని హోటల్లో బస చేస్తారు. 6న ఉదయం 10 గంటలకు పోర్టు ఎల్పీజీ బెర్త్ వద్ద శివాలిక్ నౌకను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్టు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15కి విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

News October 4, 2025

ఎన్‌ఏడీలో తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!

image

విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పనులు వేగవంతమయ్యాయి. ఎన్‌ఏడీ నుంచి కాకానినగర్ వరకు 11 మీటర్ల వెడల్పుతో తేలికపాటి వాహనాల కోసం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గాజువాక వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సులభతరం కానుంది.