News April 12, 2024
బీజేపీకి షాక్.. పార్టీని వీడిన పాలమూరు ముఖ్యనేతలు
పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. MBNR పార్లమెంట్ పరిధిలో బీజేపీకి NRPT, మక్తల్లోనే మంచి మెజార్టీ వస్తుందని భావిస్తున్న తరుణంలో నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగపాండురెడ్డి, జలంధర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ అలీ తమ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గురువారం అందజేశారు.
Similar News
News October 10, 2024
మహబూబ్నగర్లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్నగర్లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <
News October 10, 2024
కొడంగల్: నాన్నకు ప్రేమతో..!
కొడంగల్ మండలం హుస్నాబాద్కు చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించేందుకు నిరంతరం శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్య డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్జీటీగా ఎంపికైంది. దీంతో గ్రామస్థులు అభినందించారు.
News October 10, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా భద్రలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 21.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్లో 18.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.