News February 1, 2025
బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. బీఆర్ఎస్ నుంచి ఎవరో..?
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టబద్రుల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డిని నిన్న ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ, కేసీఆర్ సొంత ఇలాకాలో బీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
Similar News
News February 1, 2025
హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News February 1, 2025
మెదక్: పోలీసుల కౌన్సెలింగ్.. ప్రేమ పెళ్లి చేసిన పెద్దలు
రామాయంపేటలోని పెద్దమ్మ గుడి వద్ద ప్రేమ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల కథనం ప్రకారం.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మామిడాల వినయ్, రామాయంపేటకు చెందిన రేవతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య వినయ్ పెట్టడంతో శనివారం రేవతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబీకులు ముందుకొచ్చి రేవతి, వినయ్ పెళ్లి చేశారు.
News February 1, 2025
మెదక్: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.