News February 16, 2025
బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పని చేయాలి: మంత్రి

బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పనిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నంద్యాలలో శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అభిరుచి మధు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
ఫిరాయింపులపై CM రేవంత్ కామెంట్.. చట్టం ఏం చెబుతోంది..?

రాజ్యాంగ సవరణ-52తో 1985లో చేర్చిన పదో షెడ్యూల్లో ఫిరాయింపుల గురించి ఉంది. శాసన సభ్యులు ఎన్నికైన పార్టీకి రిజైన్ చేస్తే ఫిరాయించినట్లు. ఓటింగ్కు హాజరుకావాలని విప్ జారీ చేస్తే రాకపోయినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా స్పీకర్/ఛైర్మన్కు ఫిర్యాదు చేసి తొలగింపజేయొచ్చు. గెలిచాక మరో పార్టీలో చేరినా ఫిరాయింపే అని ఉన్నా.. <<17762540>>చేరారు<<>> అనే నిర్ధారణ వివరించలేదు. స్పీకర్ విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు.
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10 సమాధానాలు

1. శ్రీరాముడి పాదధూళితో ‘అహల్య’ శాపవిముక్తురాలైంది.
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని చంపింది ‘సహదేవుడు’.
3. కృష్ణద్వైపాయనుడు అంటే ‘వేద వ్యాసుడు’.
4. మధుర మీనాక్షి దేవాలయం ‘వైగై నది’ ఒడ్డున ఉంది.
5. చిరంజీవులు ఏడుగురు. వారు 1. అశ్వత్థామ 2. బలి చక్రవర్తి 3. వ్యాస మహర్షి 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపాచార్యుడు 7. పరశురాముడు <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
విద్యారంగంలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలి: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లాను విద్యారంగంలో ఉన్నతస్థాయిలో నిలపాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం సరస్వతి శిశుమందిర్లో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ బోధనాభ్యాసన సామగ్రి మేళాను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో రాణిస్తారని అన్నారు. విద్యార్థులను ఆకర్షించడానికి అభ్యసన సామగ్రిని తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.