News February 16, 2025

బీటెక్ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్ కోర్సు: మంత్రి శ్రీధర్ బాబు

image

గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్ల‌లో (జీసీసీ) తెలంగాణ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ద‌క్కేలా ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుంటుంద‌ని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద్యోగాలు కోసం ప్ర‌య‌త్నిస్తున్న ప‌ట్ట‌భ‌ద్రులు స్కిల్స్ యూనివ‌ర్సిటీ వెబ్ సైట్‌ ( yisu.in ) త‌ర‌చూ సంద‌ర్శించాల‌ని మంత్రి సూచించారు. ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామని మంత్రి తెలిపారు.

Similar News

News October 27, 2025

మొంథా ఎఫెక్ట్.. నెల్లూరుకు రూ.కోటి నిధులు

image

మొంథా తుపాన్‌ను ఎదుర్కునేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

News October 27, 2025

కృష్ణా: తీరప్రాంత ప్రజలకు మడ అడవులు రక్షణ కవచం.!

image

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంత ప్రజలకు రక్షణ కవచంలా మడ అడవులు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సహజ సంపద నేడు అంతరించిపోతున్న స్థితికి చేరుకోవడంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో విపత్తు ప్రభావం తక్కువగా కనిపించిందని, అదేవిధంగా 2004 సునామీ సమయంలో కూడా ఈ మడ అడవులే సహజ రక్షణగా నిలిచాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.

News October 27, 2025

గుంటూరు జిల్లాలో నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,99,558 కార్డులు ఉండగా వాటికి తోడు మరో 9 వేలు కొత్త కార్డులు తాజాగా ఆమోదించారు. తొలివిడతగా జిల్లాకు 5,85,615 స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఇప్పటివరకు 5,23,418 కార్డులను మాత్రమే పంపిణీ చేయగా, మరో 80 వేల కార్డులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు డీలర్లు, సచివాలయ సిబ్బంది దగ్గర పేరుకుపోయాయి.