News March 25, 2025

బీబీనగర్: ఆ గ్రామంలో దొంగల భయం 

image

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారం గ్రామంలో వారం రోజులుగా రాత్రి పూట నిత్యం ఏదో ఒక చోట దొంగలు చోరీకి ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు దొంగలు ఓ ఇంట్లో చొరబడే సమయానికి ఇంట్లో వారు నిద్రలేచి అరవడంతో పారిపోయినట్లు చెప్పారు. యువకులు దొంగల వెంటపడ్డా దొరకలేదన్నారు. పోలీసులు తమ గ్రామాన్ని దొంగల బారి నుంచి కాపాడాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. 

Similar News

News February 27, 2026

కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు

image

AP: 2027 గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని దేవాదాయ శాఖమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ భేటీలో నిర్ణయించారు. జూన్ 26 నుంచి జులై 7 వరకు 6 జిల్లాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు సిద్ధం చేయడంతో పాటు 434 ఆలయాలకు మరమ్మతులు చేయనున్నారు.

News February 27, 2026

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

*గద్వాల: కలెక్టర్ సంతోష్ బదిలీ
*నూతన కలెక్టర్ గా రిజ్వాన్ భాషా షేక్
*పోలీస్ సేవలు మెరుగుపరచాలి
*భక్తుల ఇంటి వద్దకు భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు
*కేటీ దొడ్డి: గంగన్ పల్లి లో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ
*అయిజ: సీటీపాడులో అగ్ని ప్రమాదం- రూ.50 వేలు గ్రాసం దగ్ధం
*మానవపాడు: బస్సు లేక ఆటోలో పరీక్షలకు విద్యార్థినిలు
*రాజోలి: మురుగుతో అవస్థలు రాత్రి దోమల బెడద

News February 27, 2026

చిన్నారితో వెకిలి పనులు.. దొంగ బాబాపై పోక్సో కేసు!

image

ఏడేళ్ల చిన్నారిని అసభ్యంగా తాకుతూ, వెకిలి చేష్టలు చేశాడో దొంగ బాబా. యాద్గిర్(KA) జిల్లాలోని మహల్ రోజా మఠంలో మల్లికార్జున ముత్య(26) బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ సుమోటోగా తీసుకొని జిల్లా ఎస్పీకి లేఖ రాసింది. అయితే ఆమెను కుమార్తెలా చూసుకున్నానని, ఈ కేసుపై చట్టబద్ధంగా పోరాడతానని ముత్య చెప్పాడు.