News July 6, 2024
బీబీనగర్ – నడికుడి మధ్య రెండో లైన్

బీబీనగర్- నడికుడి మధ్య రెండో రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. ఈ రైల్వే లైన్ పనులను ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఈ మార్గం డబ్లింగ్ పనుల కోసం మూడు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. 230 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం రూ.2,853.23 కోట్లను కేంద్ర రైల్వే శాఖ కేటాయించింది.
Similar News
News February 22, 2026
CM కప్.. ఫైనల్లో నల్గొండ హాకీ జట్టు

హైదరాబాద్లోని గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో నల్గొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో వనపర్తి జట్టుపై 1-0 తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. రేపు జరిగే ఫైనల్స్లో నిజామాబాద్ జట్టుతో తలపడనుంది. జట్టు విజయం పట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.
News February 22, 2026
NLG: కుమ్మెర జాతరలో శిశువు మృతిపై NHRCకి ఫిర్యాదు

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
News February 22, 2026
NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.


