News January 4, 2026
బీర్కూర్: వెల్లుల్లి నూనె తాగి వ్యక్తి ఆత్మహత్య

బీర్కూర్ మండలం వీరాపూర్కు చెందిన మచ్చర్ ప్రహ్లాద్(34) శనివారం ఉదయం వెల్లుల్లి రసం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్ నిజామాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 5, 2026
MNCL: పలకరిస్తూ.. హామీలు కురిపిస్తూ..!

మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జిల్లాలో ఊపొందుకుంటున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఒకరి కంటే అంటే ఒకరు పోటీ పడుతూ తమ వార్డు, డివిజన్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందర్నీ ప్రేమగా పలకరిస్తూ, వారి అవసరాలను తీరుస్తామని హామీలు ఇస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఎన్నికల్లో ఇవన్నీ మామూలే అంటూ సామాన్య జనం గుసగుసలాడుతున్నారు.
News February 5, 2026
HYD: ఏడుపాయల మహా జాతర తేదీలు ఇవే..!

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల మహాజాతరకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, గ్రేటర్ HYD, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది వరకు భక్తులు రానున్నారు. SHARE IT
News February 5, 2026
HYD: ఏడుపాయల మహా జాతర తేదీలు ఇవే..!

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల మహాజాతరకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, గ్రేటర్ HYD, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది వరకు భక్తులు రానున్నారు. SHARE IT


