News February 7, 2025

బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మకం: మంత్రి కొండా

image

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా చేప‌ట్టిన బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మకం అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డ‌గా తాను ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆమె గురువారం కాంగ్రెసు హైకమాండ్‌కు లేఖ‌లు రాశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ తదితరులకు లేఖలు పంపినట్లు తెలిపారు.

Similar News

News September 14, 2025

JNTUలో పార్ట్ టైం PhD కోసం ప్రవేశ పరీక్షలు

image

జేఎన్టీయూ యూనివర్సిటీలో పార్ట్ టైం PhD కోసం పరీక్షలు జరుగుతున్నాయి. నేడు ఉదయం కంప్యూటర్ సైన్స్‌ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం మెకానికల్ తోపాటు EEE విభాగంలోని కోర్సులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు వెల్లడించారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News September 14, 2025

అనంతపురంలో కిలో టమాటా ధర రూ.17

image

అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం కిలో గరిష్ఠ ధర రూ.17, కనిష్ఠ ధర రూ.8 ఉంది. సరాసరి రూ.12 ప్రకారం క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. ఇప్పటికే రైతులు పెద్దమొత్తంలో టమాటాను మార్కెట్‌కు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

News September 14, 2025

అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ అన్నమయ్యకు బదిలీ

image

అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ కే.ధీరజ్ ను అన్నమయ్య జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ధీరజ్ శిక్షణ పూర్తి చేసుకుని, 2023లో పాడేరు ఏఎస్పీగా తొలి పోస్టింగ్ లో చేరారు. తరువాత రంపచోడవరం ఏఎస్పీగా పనిచేస్తూ గత ఏడాది జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. తాజాగా జరిగిన బదిలీల్లో అన్నమయ్య జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యారు.