News February 6, 2026

బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయంలో జేసీ తనిఖీ

image

బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయాన్ని జేసీ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు. వెబ్ ల్యాండ్ అడంగల్‌లో క్లైమ్ చేయని, ఇతరుల పేరిట ఉన్న మిగులు భూముల వివరాలను పరిశీలించారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి పత్రాలు సేకరించాక, రికార్డుల ఆధారంగా మ్యూటేషన్ చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News February 21, 2026

24 గంటల విద్యుత్ ఉత్పత్తి.. ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణ

image

గాలిమరలు, సోలార్ ప్యానెళ్లతో సంబంధం లేకుండా 24గంటల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ‘విండ్ స్ట్రీమ్’ పరికరాన్ని ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. శుక్రవారం క్యాంపస్‌లో జరిగిన ‘ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026’ జాతీయ సదస్సులో ఈటెక్నాలజీని ప్రదర్శించారు. నిరంతరం విద్యుత్ అందించే ఈ పరికరాన్ని ఇళ్లు, అపార్టుమెంట్లు, కార్యాలయాల్లో సులభంగా అమర్చుకోవచ్చని విద్యార్థులు వివరించారు.

News February 21, 2026

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

image

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ విద్యా అధికారి (ఆర్‌ఎస్‌ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్‌ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 21, 2026

24 గంటల విద్యుత్ ఉత్పత్తి.. ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణ

image

గాలిమరలు, సోలార్ ప్యానెళ్లతో సంబంధం లేకుండా 24గంటల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ‘విండ్ స్ట్రీమ్’ పరికరాన్ని ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. శుక్రవారం క్యాంపస్‌లో జరిగిన ‘ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026’ జాతీయ సదస్సులో ఈటెక్నాలజీని ప్రదర్శించారు. నిరంతరం విద్యుత్ అందించే ఈ పరికరాన్ని ఇళ్లు, అపార్టుమెంట్లు, కార్యాలయాల్లో సులభంగా అమర్చుకోవచ్చని విద్యార్థులు వివరించారు.