News October 5, 2024
బుచ్చియ్యపేట: కరెంట్ షాక్.. బాలుడు మృతి

విద్యుత్ షాక్కు గురై బాలుడు మృతిచెందిన ఘటన బుచ్చియ్యపేట మండలంలోని పి.భీమవరంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేపాడ అప్పారావు కుమారుడు భువన్ శంకర్ శనివారం పొలంలోకి వెళ్లాడు. అక్కడ గెడ్డ దాటుతుండగా అప్పటికే నేలపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చోడవరం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News September 21, 2025
గూగుల్ డేటా సెంటర్కు భూసేకరణ.. రైతుల విజ్ఞప్తులు ఇవే..!

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణలో నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారుల భూములకు రిజిస్టర్ మార్కెట్ ధరలో సగం మేర మాత్రమే ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. 20ఏళ్ల క్రితం డీఆర్డీఈ ద్వారా మొక్కల పెంపకానికి ఇచ్చిన భూములకు కూడా నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. సోమవారం విశాఖ వస్తున్న CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా హామీ ఇచ్చారు.
News September 21, 2025
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సమీక్ష

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణపై MLAగంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్షించారు. గ్రామంలో సబ్రిజిస్ట్రార్ ధర ఎకరానికి రూ.17లక్షలు ఉందని, D.పట్టా భూములకు ఎకరానికి రెండున్నర రెట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. 520మంది రైతులకు వారి భూముల స్వరూపాన్ని బట్టి పరిహారం అందిస్తామన్నారు. గూగుల్ డేటా సెంటర్లో రైతుల కుటుంబాలకు ఉపాధి ఇచ్చేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు.
News September 20, 2025
విద్యుత్తు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు: సీఎండీ

విద్యుత్తు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ అన్నారు. విశాఖ సాగర్ నగర్లోని ట్రైనింగ్ సెంటర్లో విశాఖ ఐఐఎం సహకారంతో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. వినియోగదారులకు మరింత చేరువకావడానికి ఉపయోగపడతాయన్నారు. శిక్షణ పూర్తి చేసిన అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు.