News December 19, 2025

బుల్లెట్ రైలు కోసం అనంతపురం జిల్లాలో భూ పరీక్షలు

image

హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లాలో మట్టి పరీక్షలు నిర్వహించారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం మండలాల్లోని 40 ప్రాంతాల్లో నమూనాలు సేకరించింది. ఈ గ్రౌండ్ లెవల్ రిపోర్టు ఆధారంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు ముందుకు సాగనున్నాయి. రవాణా రంగంలో ఇది సరికొత్త విప్లవానికి నాంది కానుంది.

Similar News

News December 20, 2025

చౌడేపల్లి: ‘సచివాలయ సిబ్బందికి జీతాలు నిలుపుదల’

image

చౌడేపల్లె మండలం చారాల సచివాలయంలోని పలువురి సిబ్బందికి మూడు నెలల జీతాలను నిలుపుదల చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓం ప్రసాద్, కృష్ణమూర్తి, హిమబిందు, సోమశేఖర్, మహమ్మద్ ఆరీఫ్ లకు జీతాలు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే వారికి జీతాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

News December 20, 2025

మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గుంటూరు పోలీసుల పతక వర్షం

image

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన 44వ ఏపీ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2025లో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సత్తా చాటారు. ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కలిపి ఆరుగురు పాల్గొని మొత్తం 18 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించారు. వివిధ వయో విభాగాల్లో ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో మెరిసిన విజేతలను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.

News December 20, 2025

BHPL: పీఏసీఎస్‌లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

image

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార పరపతి సంఘాలకు రద్దయిన పాలకవర్గాల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను కమీషనర్ నియమించినట్లు జిల్లా సహకార శాఖ అధికారి వాల్యానాయక్ తెలిపారు. గారేపల్లి, మహాదేవపూర్, మహాముత్తారం, చిట్యాల సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, రేగొండ, మొగుల్లపెళ్లి- డిప్యూటీ రిజిస్టర్ శైలజ, తాడిచెర్ల జంగేడు- సీనియర్ ఇన్స్పెక్టర్ రిలీఫ్, ఘనపూర్, చెల్పూర్- ఎల్లయ్యలను నియమించారు.