News December 15, 2025

బెంగాల్‌లో 58 లక్షల ఓట్ల తొలగింపు!

image

బెంగాల్‌లో SIR ప్రక్రియ ముగియడంతో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణను EC ప్రారంభించింది. రేపు డ్రాఫ్ట్ లిస్ట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. రాష్ట్రంలో 7.66కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. SIRలో భాగంగా 58.2 లక్షల ఓట్లను తొలగించినట్లు సమాచారం. 31.39 లక్షల మంది విచారణకు హాజరుకానున్నట్లు EC స్టేటస్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. మరో 13 లక్షలకు పైగా ASD(ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్&డూప్లికేట్ ఓటర్స్)లను గుర్తించారు.

Similar News

News December 16, 2025

AP న్యూస్ రౌండప్

image

☛ మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్లు, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కేటాయిస్తూ క్రీడా శాఖ స్పెషల్ CS అజయ్ జైన్ ఉత్తర్వులు
☛ నేడు TTD ధర్మకర్తల మండలి సమావేశం
☛ ఇంద్రకీలాద్రి: 5 రోజుల్లో దీక్షలు విరమించిన 5.77 లక్షల మంది భవానీలు
☛ ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి CM CBN
☛ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు చెవిరెడ్డి.. విచారణ 22వ తేదీకి వాయిదా

News December 16, 2025

పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

image

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.

News December 16, 2025

పుణ్యాన్నిచ్చే రెండు పవిత్ర మంత్రాలు…

image

1. “ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః”
2. “ఓం శ్రీ రంగ నిలయాయై నమః”
ఈ పవిత్ర ధనుర్మాసంలో ప్రతిరోజు ఈ రెండు మంత్రాలను పఠించాలని పండితులు సూచిస్తున్నారు. శ్రీవ్రతం ఆచిరించే వారితో పాటు, పూజ చేయనివారు కూడా పఠించవచ్చని చెబుతున్నారు. పూజా మందిరంలో కొలువైన విష్ణుమూర్తి ఏ రూపాన్నైనా చూస్తూ పఠిస్తే.. సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. ఇంట్లో మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.