News March 5, 2026

బెంబేలెత్తుతున్న శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు

image

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం పుట్టపర్తి మండలంలో 35.21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ధర్మవరం, కదిరి మండలాల్లో 34.21, హిందూపురం మండలంలో 34.19 డిగ్రీలు నమోదయ్యాయి.

Similar News

News April 14, 2026

రియల్ హీరో❤️

image

వేసవిలో పక్షులకు కాసిన్ని నీళ్లు పెట్టడానికే మనం విసుగు చెందుతాం. కానీ గుజరాత్ జూనాగఢ్‌కు చెందిన హర్సుఖ్‌భాయ్ వఘాసియా మాత్రం పదివేల పక్షులకు ‘అన్నదాత’గా మారారు. 28 ఏళ్ల క్రితం ఒక పిట్టతో మొదలైన ఆయన ప్రయాణం.. నేడు 4 ఎకరాల్లో 10వేల పక్షుల కడుపు నింపే స్థాయికి చేరింది. దీనికోసం ఆయన ఏటా ₹2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. విలాసాలకు దూరంగా ఉంటూ మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన వఘాసియా నిజమైన హీరో.

News April 14, 2026

ADB: ఇండస్ట్రియల్ పార్క్ చుట్టూ బినామీల దందా..!

image

జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ భూములపై రాజకీయ ప్రముఖుల కన్ను పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భీంపూర్, బోరజ్ ప్రాంతాల్లో ఓ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు వందల ఎకరాలు ముందే కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం తక్కువ ధరకు కొని, భూసేకరణ ద్వారా అధిక ధరకు ప్రభుత్వానికే విక్రయించేలా ‘క్విడ్ ప్రో కో’ జరుగుతోందని మాజీ మంత్రి జోగు రామన్న అనుమానం వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

News April 14, 2026

మెదక్: హైవేపై మరమ్మత్తులను పరిశీలించిన కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న నేషనల్ హైవే 765-డీజీ రోడ్డు మరమ్మత్ పనులను కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.