News February 6, 2025
బెజ్జూర్: పంచాయతీ కార్యదర్శులతో MEETING

మండల అభివృద్ధి కార్యాలయంలో నేడు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో గౌరీశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశానుసారం ఎన్నికల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణంలో ఆయన రావచ్చని అందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.
Similar News
News December 25, 2025
మతం, ధర్మం.. రెండూ ఒకటేనా?

వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మతం ఓ నిర్దిష్ట దైవాన్ని పూజించే పద్ధతి. ఇది గ్రంథం, నమ్మకాల చుట్టూ తిరుగుతుంది. ఇది మనుషులు ఏర్పాటు చేసుకున్న ఓ వ్యవస్థ. కానీ ధర్మం అనేది విశ్వవ్యాప్తమైనది. ‘ధరించునది’ అని దీని అర్థం. అంటే సత్యం, అహింస, బాధ్యత, మానవత్వాన్ని పాటించడం. మతం మారవచ్చు కానీ ధర్మం (ఉదాహరణకు: తల్లిగా ధర్మం, మనిషిగా ధర్మం) ఎప్పటికీ మారదు. మతం వ్యక్తిగతమైనది. ధర్మం సామాజికమైన క్రమశిక్షణ.
News December 25, 2025
ఎన్కౌంటర్లో ఆరుగురు మావోలు హతం.. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా!

ఒడిశాలోని కందమాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు, నల్గొండ(D) పుల్లెంల వాసి గణేశ్ ఉయికె అలియాస్ పాక హన్మంతు ఉన్నారని తెలిపింది. 40 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా ఉన్న ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. ఒడిశా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని పేర్కొంది.
News December 25, 2025
సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ పదవులకు రేపే దరఖాస్తులు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యవర్గంలో పదవుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆశావాహులు తమ పేర్లను దరఖాస్తు ఫారం ద్వారా సమర్పించాలని సూచించారు. ఈ నెల 26న ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో టీపీసీసీ అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, చైతన్య రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారని తెలిపారు.


