News March 23, 2025

బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు: తిరుపతి SP 

image

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాతనేరస్థుల వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడినా చర్యలు తప్పవన్నారు.

Similar News

News January 9, 2026

ట్రంప్ మాస్టర్ ప్లాన్.. గ్రీన్‌లాండ్ ప్రజలకు డాలర్ల వల?

image

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునేందుకు ట్రంప్ టీమ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అక్కడి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్కరికి లక్ష డాలర్ల వరకు ఆఫర్ చేయాలని వైట్‌హౌస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే COFA ఒప్పందం ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారట. దీని ప్రకారం.. గ్రీన్‌లాండ్‌లో US ఆర్మీ కార్యకలాపాలు కొనసాగించుకుంటుంది. దీనికి ప్రతిఫలంగా USతో గ్రీన్‌లాండ్‌ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు.

News January 9, 2026

VJA: దైవ దర్శనాల పేరుతో టోకరా.. పోలీసులకు ఫిర్యాదు!

image

మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర పేరు చెప్పి దైవ దర్శనాల సాకుతో కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్లకు పాల్పడ్డారు. భక్తులను నమ్మించి నగదు వసూలు చేస్తున్న విషయం బాధితుల ద్వారా ఆయన దృష్టికి రావడంతో రవీంద్ర తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సహాయ కార్యదర్శి ప్రసాద్ శుక్రవారం పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసపూరిత వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

News January 9, 2026

నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతుల పచ్చజెండా

image

నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతులు పూర్తిస్థాయిలో అంగీకారం తెలిపారు. దౌల్తాబాద్ సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ మండలాల రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు. సుమారు రూ.4,885 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 32 గ్రామాల్లోని 23,758 ఎకరాలకు సాగునీరు అందనుంది.