News March 18, 2025
బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

యువత, విద్యార్థులు బెట్టింగ్కు దూరంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్ ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని, దానిని మంచికి వినియోగించాలన్నారు.
Similar News
News November 4, 2025
అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఘనపూర్ 6.2 గోపాల్ పేట్ 7.2 వనపర్తి 6.2 ఆత్మకూరు 13.6 వీపనగండ్ల 0.8 రేవల్లి 2.8 చిన్నంబాయిలలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు. జిల్లా ఒకరోజు వర్షపాతం మొత్తం 59.6 మిల్లీమీటర్లు కాగా సగటు 4.2 మిల్లీమీటర్లు నమోదయిందన్నారు.
News November 4, 2025
గచ్చిబౌలి: కో-లివింగ్లో RAIDS.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు కన్జ్యూమర్స్ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
News November 4, 2025
అమ్రాబాద్: పుష్కర కాలంగా ఇన్ఛార్జ్లే దిక్కు

నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచు గిరిజనుల సంక్షేమ కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) కార్యాలయానికి గత 12 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్లతో కొనసాగుతుంది. కీలక శాఖల పోస్టులన్నీ ఖాళీలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచులకు సరిగ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అంటున్నారు. రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ను నియమించాలని చెంచులు కోరుతున్నారు.


