News March 25, 2025
బెట్టింగ్ భూతానికి అనకాపల్లి జిల్లా యువకుడు బలి

క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం ప్రకారం.. గుండ్ల పోచంపల్లిలో నివాసముంటున్న సోమేశ్(29) బెట్టింగ్లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమేశ్ అనకాపల్లి జిల్లావాసిగా పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 16, 2025
బాపట్ల: ‘స్కాన్ సెంటర్లకు రెన్యువల్ తప్పనిసరి’

స్కాన్ సెంటర్ నిర్వాహకులు రెన్యువల్ తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేని స్కాన్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, మెడికల్ వేస్ట్, బయో మెడికల్పై అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్వో పాల్గొన్నారు.
News November 16, 2025
సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న సత్యజ్యోతి

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో<<18299363>> వెయిట్లిఫ్టర్<<>> టీ.సత్యజ్యోతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 89 కిలోల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. దీంతో అప్పట్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ ప్రశంసలు కూడా అందుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్కు ఎంపికైన సత్యజ్యోతి మరి కొద్ది రోజుల్లోనే విధుల్లో చేరాల్సి ఉంది.
News November 16, 2025
పులగుర్త చేనేతకు నారా లోకేశ్ ఫిదా

విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్లో ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తూ.గో జిల్లా అనపర్తి(M) పులగుర్తలో నేసిన చేనేత జాకెట్ను ఆయన ధరించారు. విదేశీ హంగులు కాదు, మన మట్టి పరిమళమే అసలైన అందమని ఈ వస్త్రం నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. మన మూలాల్లోనే గొప్ప ఫ్యాషన్ దాగుందన్నారు. ‘అత్యుత్తమ స్టైల్ మన ఇంట్లోనే (రాష్ట్రంలోనే) నేస్తారు’ అంటూ లోకేశ్ చేనేతల నైపుణ్యాన్ని ఆకాశానికెత్తేశారు.


