News February 1, 2025
బెల్లంపల్లి: అడవి పందిని హతమార్చిన పెద్దపులి

2 రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గ దేవాలయం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం మండల ప్రజలను హడలెత్తిస్తోంది. బుగ్గకు వెళ్లే రహదారి పక్కన తోకల మల్లేశ్కు చెందిన పత్తి చేనులో అడవి పందిపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పెద్దపులి దాడి విషయాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.
Similar News
News February 27, 2026
భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

భద్రాద్రి రామాలయంలో శుక్రవారం సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కంకణధారణ గావించి కల్యాణాన్ని జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
News February 27, 2026
RARE: ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన చైనా మహిళ

చైనాలోని షిన్జియాంగ్కు చెందిన 24 ఏళ్ల దిలి అనే మహిళ ‘వుహాన్ యూనివర్సిటీ’ ఆసుపత్రిలో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. 20 మంది వైద్య సిబ్బంది కృషితో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి క్షేమంగా జన్మించారు. సహజసిద్ధంగా ఇలా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం 6 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుందని వైద్యులు తెలిపారు. తమ కెరీర్లో ఇదే అత్యంత అరుదైన ప్రసవమని చీఫ్ డాక్టర్ పేర్కొన్నారు.
News February 27, 2026
45 కేసులు ఛేదన.. 76 మంది అరెస్టు: సీపీ

గడిచిన జనవరి నెలలో 69 ఆస్తి నేరాలు జరిగాయని 45 కేసులు గుర్తించి 76 మందిని అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల ప్రాపర్టీ మేళ నిర్వహించగా రూ.39.79 లక్షలు, 420 పోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 63 లక్షలు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు నగరంలో రూ. 13.94 కోట్లు విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.


