News September 13, 2025

బెల్లంపల్లి: ఎన్‌కౌంటర్‌లో మావో వెంకటి మృతి

image

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన మావోయిస్టు నాయకుడు జాడి వెంకటి ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ అటవీ ప్రాంతంలో గురువారం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 1996లో అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకటి, పార్టీలో కీలక పాత్ర పోషించారు. జాడి పోచమ్మ-ఆశయ దంపతులకు ఒక్క కుమారుడు కావడంతో కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. తహశీల్దార్‌ కార్యాలయంలో సుంకరిగా పనిచేస్తూ మావో కొరియర్‌గా పనిచేశాడని స్థానికులు తెలిపారు.

Similar News

News March 29, 2026

UPDATE: యమపాశమైన టైరు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

image

మణుగూరు ఏరియాలోని దుర్గా కంపెనీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. డంపర్ టైరు మెయింటెనెన్స్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలడంతో ఐదుగురు బీహార్ కార్మికులు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం తరలించారు. విషయం తెలిసిన సీఐటీయూ నేతలు మంద నరసింహారావు, వెంకటరత్నం ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

News March 29, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం..

image

మర్రిపాడు మండలం నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుకు గురై గోగుల నవనీత్ (5) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

News March 29, 2026

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీలేదు: కలెక్టర్

image

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని,నగర ప్రజలు ఈనెల 31వ తేదీ లోపు పన్నులు చెల్లించి జరిమానా భారాన్ని నివారించుకోవాలని కలెక్టర్, జీసీడబ్ల్యూపీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆదివారం వరంగల్‌లో 14,37,38 డివిజన్లలో, హనుమకొండలోని 5వ డివిజన్లోని సురేంద్రపురి, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పన్నుల సేకరణను పరిశీలించారు. ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.