News October 17, 2024
బెల్లంపల్లి: కారు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారి మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ కార్వా (42) అనే వ్యాపారి కారు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..ఇవాళ ఉదయం కారులో హైదరాబాదుకు బయలుదేరిన రాజేష్ సిద్దిపేట-గద్వేల్ మార్గమధ్యలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలిపారు.
Similar News
News October 17, 2024
ఆదిలాబాద్: కొమురం భీమ్కు KTR నివాళి
ఆదివాసీ యోధుడు.. అరణ్య సూర్యుడు.! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ కొమురం భీం అని మాజీ మంత్రి KTR (X) వేదికగా పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి.. కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమ బాటలో.. ఉజ్వల ప్రగతి దారిలో జల్.. జంగల్.. జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామన్నారు.
News October 17, 2024
ఆదిలాబాద్ : ఈనెల 21న జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా
ఐటీఐ పాసైన విద్యార్థులకు ఈనెల 21న ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఈ మేళలో పాల్గొని శిక్షణార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మేళాలో పాల్గొనేవారు apprenticeship.gov.in పోర్టల్ లో నమోదు చేసుకొని తగిన పత్రాలతో హాజరు కావాలన్నారు.
News October 17, 2024
KU డిగ్రీ, పీజీ బ్యాక్లాగ్ పేపర్లకు అనుమతి: రిజిస్ట్రార్
కేయూ పరిధిలోని డిగ్రీ, పీజీ బ్యాక్లాగ్ విద్యార్థులకు 2024- 25 విద్యా సంవత్సరం కాలపరిమితికి సంబంధించి రాత, ప్రాక్టికల్, సెమినార్ పరీక్షలు క్లియర్ చేయడానికి అనుమతి ఇస్తూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పరీక్షా ఫీజుకు సంబంధించి మరిన్ని వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చన్నారు.