News April 11, 2025

బెల్లంపల్లి: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి

image

బెల్లంపల్లిలోని ఆకినేపల్లి శివారులో చింతచెట్టుకు 5రోజుల క్రితం ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాళ్లగురజాల ఎస్ఐ రమేశ్ తెలిపారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌కు గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి చెందిన చేను వద్ద దుర్వాసన రావడంతో గమనించాడు. చెట్టు కొమ్మల మధ్య ఓ వ్యక్తి ఉరేసుకొని ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 2, 2026

SKLM: ఇంటర్ పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,164 మంది రాశారు. ఒకేషనల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 1,510 మందికి గాను 1,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.

News March 2, 2026

భూపాలపల్లి: ప్రజావాణిలో 65 దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 65 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఆయా దరఖాస్తులను అధికారులు జాప్యం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News March 2, 2026

కలెక్టర్ జితేష్ పాటిల్‌కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు

image

టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా బదిలీ అయిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌కు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన భార్యకు రెండో కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించి, సామాన్యులకు సర్కారు వైద్యంపై నమ్మకం కలిగించిన ఆయన సేవలు మరువలేమని, ఆయన బదిలీ జిల్లాకు తీరని లోటని వక్తలు పేర్కొన్నారు.