News January 27, 2025

బెల్లంపల్లి: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

image

నీటి సంపులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. CI మహేందర్ కథనం ప్రకారం.. గీసుకొండ(M) శాయంపేటకు చెందిన శుభశ్రీకి బెల్లంపల్లికి చెందిన ప్రదీప్ కుమార్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా గతేడాది ప్రదీప్ మృతిచెందడంతో శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. ఆదివారం ఆమె స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమారుడు నీటి సంపులో పడి మృతి చెంది ఉన్నాడు.

Similar News

News November 14, 2025

23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

image

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్‌నగర్ TIMS, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 14, 2025

మంచిర్యాల: ‘శబరికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి’

image

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల నుంచి శబరి కి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కేరళ ఎక్స్ప్రెస్ కు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ పార్టీ నాయకులు కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ ను కలిసి వినతిపత్రం అందజేశారు. చెన్నై సెంట్రల్ నుంచి భగత్ కి రాజస్థాన్ వరకు నడుస్తున్న రైలుకు హాల్టింగ్ కల్పించాలన్నారు.