News November 24, 2025
బెల్లంపల్లి: ‘రైతు బిడ్డలు.. మీకెందుకు ఇవన్నీ’

ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురిచేస్తోందని.. తల్లిదండ్రులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు రాసిన లేఖ జిల్లాలో సంచలనం రేపింది. బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ సమస్యలు విన్నవిస్తే ‘మీరు రైతు బిడ్డలు మీకెందుకు ఇవన్నీ’ అని అంటుందని అందులో పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్
Similar News
News November 25, 2025
మంచి జరగబోతోంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
జిల్లాలో మొబైల్ కనెక్టివిటీ పెంపు: కలెక్టర్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతి గ్రామానికి మెరుగైన మొబైల్ సేవలు అందించేందుకు కొత్త టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. టవర్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను తక్షణమే గుర్తించి, భూ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. కనెక్టివిటీ పెంపుకు అవసరమైతే అటవీ భూమి వినియోగం అంశాన్ని కూడా పరిశీలించాలని తెలిపారు.
News November 25, 2025
UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్గా మారింది.


