News August 4, 2024
బెల్లంపల్లి: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

బెల్లంపల్లి- రేచిని రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారు జామున రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 30-35 సంవత్సరాలు ఉండగా, ఒంటిపై పూల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మంచిర్యాల జీఆర్పీ ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ మృతదేహాన్ని బెల్లంపల్లిలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు చేశారు.
Similar News
News September 15, 2025
40 ఫిర్యాదులను స్వీకరించిన ఆదిలాబాద్ ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజల రక్షణ భద్రతకు ఎల్లవేళలా ముందుంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం డీపీఓ ఆఫీస్లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా స్పందించి వెంటనే ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలించారు. సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 40 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.
News September 15, 2025
ఆదిలాబాద్: ఇవాళ, రేపు DEGREEలో SPOT అడ్మిషన్లు

ఈనెల 15,16వ తేదీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. బీఏ ఇంగ్లిష్ మీడియం, తెలుగు/ఉర్దూ మీడియంలో సీట్లు కాళీగా ఉన్నాయన్నారు. అలాగే బీకాం తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో సీట్లు ఉన్నట్లు తెలియజేశారు. ప్రవేశం పొందగల విద్యార్థులు ఒక సెట్ జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
News September 14, 2025
ADB: లోక్ అదాలత్లో న్యాయం: జిల్లా జడ్జి

లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, రాజీమార్గమే రాజమార్గం అని తెలిపారు. బోథ్ జూనియర్ కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప్, రాజీ ద్వారా 34 క్రిమినల్ కేసులు, ఒక సివిల్ వివాదం, నేరం ఒప్పుకోవడం ద్వారా 22 ఎక్సైజ్ కేసులు, 429 ఎస్టీసి కేసులను పరిష్కరించారు.