News September 25, 2025
బెల్లంపల్లి: 316 మంది కార్మికులు రెగ్యూలరైజ్

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన 258 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాంపూర్ ఏరియాలో 241, మందమర్రి ఏరియాలో 64, బెల్లంపల్లి ఏరియాలో 11 మంది ఉద్యోగులు రెగ్యూలరైజ్ అయ్యారు. భూగర్భ గనుల్లో 190, ఓసీలు, సర్ఫేస్లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారు అర్హులు
Similar News
News September 25, 2025
నిర్మల్ కలెక్టరేట్లో దివ్యాంగులకు తిప్పలు

జిల్లా కలెక్టరేట్లో లిఫ్టులు పనిచేయకపోవడంతో పై అంతస్తులకు వెళ్లేందుకు దివ్యాంగులకు, వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ పనుల నిమ్మిత్తం కలెక్టరేట్కు వచ్చిన దివ్యాంగులు, ముసలి వారు పై అంతస్థుతులకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందని వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
News September 25, 2025
ఒత్తిడి చాలా ప్రమాదకరం: అక్షయ్ కుమార్

నేటి ప్రపంచంలో ఒత్తిడి చాలా ప్రమాదకరమని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆర్థిక, ఇతర సమస్యలతో ప్రెషర్కు గురై జీవితాన్ని కష్టతరం చేసుకోవద్దని ఓ షోలో చెప్పారు. సాదాసీదాగా జీవితాన్ని గడపాలని సూచించారు. తాను అందరిలాగే సెలవులు తీసుకుంటానని, ఏడాదిలో 125 రోజులు బ్రేక్లో ఉంటానని పేర్కొన్నారు. ఆదివారాలు, సమ్మర్ వెకేషన్, దీపావళికి 3 రోజులు సెలవులో ఉంటానని పేర్కొన్నారు. సమయపాలన పాటించడం చాలా ముఖ్యమన్నారు.
News September 25, 2025
జనగామ: బోధకులకు రూ.8వేలు, ఆయాలకు రూ.6 వేల వేతనం..!

జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో బోధించే వారికి నెలకు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఇన్ఛార్జి డీఈవో పింకేష్ కుమార్ తెలిపారు. స్థానికులు మాత్రమే ప్రీ ప్రైమరీ పోస్టుల దరఖాస్తులకు అర్హులని వెల్లడించారు. 18 నుంచి 44 సంవత్సరాలలోపు వారై, ప్రీ ప్రైమరీ బోధనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.