News October 14, 2025
బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి: భట్టి

రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాలో కలెక్టర్లతో మాట్లాడారు. పాఠశాలలలో చదివే విద్యార్థుల సంక్షేమంపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 15, 2025
ఓయూ: ఎంఈ, ఎం.టెక్ పరీక్షా తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎం.టెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎం.టెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
News October 15, 2025
సిరిసిల్ల: జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలు

జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలు, హైస్కూలలో ఈ జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News October 15, 2025
భూసేకరణ పూర్తి చేయండి: కలెక్టర్

కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏలూరు పవర్ పేట గేటు వద్ద, దెందులూరు (M) సీతంపేట- శ్రీరామవరం, భీమడోలు రైల్వే గేట్, పూళ్ల, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎటువంటి అభ్యంతరాలు, శాంతిభద్రతల సమస్యలు ఉండకూడదన్నారు.