News August 5, 2024

బైకులోకి దూరిన పాము.. మడకశిరలో కలకలం

image

పాములు ఏ తుప్పల్లోనో, పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇళ్లలో, బాత్ రూం, షూలలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా మడకశిరలో బైకులో ఓ పాము కలకలం రేపింది. తిప్పేస్వామి నాయక్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో బయలుదేరగా అప్పటికే బైక్‌లో దాక్కున్న పాము ఒక్కసారిగా బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. భయందోళనకు గురైన వాహనదారుడు బైక్‌ను కింద పడేసి పరుగులు తీశాడు.

Similar News

News September 30, 2024

నారా లోకేష్‌ను కలిసిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి

image

విజయవాడలోని ఏపీ సచివాలయ ఛాంబర్‌లో మంత్రి నారా లోకేష్‌ను తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.

News September 30, 2024

గన్‌మెన్లను వెనక్కు పంపిన అనంతపురం MLA?

image

అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. రాప్తాడు వైసీపీ నేత మహానందరెడ్డికి ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయించడంతో నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానందరెడ్డి గతంలో ముగ్గురి హత్య కేసులో నిందితుడు. దీంతో సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్‌మెన్‌లను ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

News September 30, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.47

image

అనంతపురంలో టమాటా ధర వారం రోజులుగా నిలకడగా ఉంది. కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.47 పలికినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మార్కెట్‌కు 1350 టన్నుల టమాటాలు వచ్చాయని చెప్పారు. సరాసరి ధర కిలో రూ.38, కనిష్ఠంగా రూ.30 పలికినట్లు పేర్కొన్నారు. ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది.