News March 30, 2025

బైక్ ఎక్స్‌పెడిషన్ బృందానికి స్వాగతం

image

250వ AOC కార్పస్ డేను పురస్కరించుకుని బయలుదేరిన బైక్ ఎక్స్‌పెడిషన్ బృందాన్ని CAD పులగాన్ వద్ద ఉత్సాహంగా స్వాగతించారు. ఈ బృందం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు 2200 కి.మీ ప్రయాణించి మార్గమధ్యలో వీర నారులు, వేటరన్లు, విద్యార్థులతో పరస్పర కలయిక సాధించనుంది. ఆ తర్వాత వీరిని అధికారికంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.

Similar News

News November 11, 2025

ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

image

AP: తిరుపతి (D) కేవీబీపురం(M) ఒల్లూరులోని రాయలచెరువుకు గండి పడటంతో నీటమునిగిన కళత్తూరు ఎస్సీ కాలనీ, SL పురం, పాతపాలెం ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 960 కుటుంబాలను ఆదుకునేందుకు రూ.3.24కోట్లు మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.3వేలు, 25కిలోల బియ్యం తదితర నిత్యావసరాలు అందించనున్నారు. అలాగే వరదలో చనిపోయిన 1,100 పశువులకు CM రిలీఫ్ ఫండ్ నుంచి రూ.83.50లక్షల పరిహారం ఇవ్వనున్నారు.

News November 11, 2025

చక్కటి కురులకు చక్కెర స్నానం

image

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్‌పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

News November 11, 2025

TTDకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా

image

తిరుమలకు రూ.251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని 2022-24 మధ్య భోలేబాబా డెయిరీ సరఫరా చేసినట్టు A16 అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్‌లో CBI SIT పొందుపరిచింది. ఇందులో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల కల్తీ నెయ్యిని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా తరలించారని సిట్ పేర్కొంది.