News March 30, 2025
బైక్ ఎక్స్పెడిషన్ బృందానికి స్వాగతం

250వ AOC కార్పస్ డేను పురస్కరించుకుని బయలుదేరిన బైక్ ఎక్స్పెడిషన్ బృందాన్ని CAD పులగాన్ వద్ద ఉత్సాహంగా స్వాగతించారు. ఈ బృందం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు 2200 కి.మీ ప్రయాణించి మార్గమధ్యలో వీర నారులు, వేటరన్లు, విద్యార్థులతో పరస్పర కలయిక సాధించనుంది. ఆ తర్వాత వీరిని అధికారికంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
Similar News
News April 1, 2025
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు.
News April 1, 2025
భద్రాచలం: ట్రైబల్ మ్యూజియం పట్ల కలెక్టర్ సంతృప్తి

ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా నేటి తరానికి అందించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియాన్ని పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి సందర్శించారు. మ్యూజియంలో గిరిజన సంస్కృతిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కళాఖండాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
News April 1, 2025
కనగానపల్లిలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన ఓబిరెడ్డి (32) మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఓబిరెడ్డిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఓబిరెడ్డి ఎంబీఏ చదివి వ్యవసాయం చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.