News February 13, 2025
బైరెడ్డిపల్లి: సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన యువకుడు

బైరెడ్డిపల్లికి చెందిన మేస్త్రి కృష్ణప్ప కుమారుడు విశ్వనాథ్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్న.. నా భార్య, కూతురును బాగా చూసుకోండి. నేను చనిపోయాక వచ్చే చంద్రన్న బీమా, ఇన్సూరెన్స్ నగదు నేను ఇవ్వాల్సిన అప్పుల వాళ్లకు ఇచ్చి మిగిలిన డబ్బులు నా భార్య బిడ్డలకు ఇవ్వండి’ అని లెటర్లో రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తన తండ్రి తెలిపాడు.
Similar News
News February 12, 2026
చిత్తూరు: ఓటర్ల జాబితాకు కసరత్తు!

జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పుంగనూరు, నగరి, పలమనేరు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పాలకమండలి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందో తెలియాల్సి ఉంది. చిత్తూరులో 50 డివిజన్లు, పలమనేరు మున్సిపాలిటీలో 26, నగరిలో 29, కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా మార్చి 9న ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు చర్యలు చేపట్టారు.
News February 12, 2026
చిత్తూరు: ఓటర్ల జాబితాకు కసరత్తు!

జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పుంగనూరు, నగరి, పలమనేరు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పాలకమండలి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందో తెలియాల్సి ఉంది. చిత్తూరులో 50 డివిజన్లు, పలమనేరు మున్సిపాలిటీలో 26, నగరిలో 29, కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా మార్చి 9న ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు చర్యలు చేపట్టారు.
News February 12, 2026
హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తాం: చిత్తూరు SP

జరిమానాల ద్వారా కాకుండా అవగాహన ద్వారా హెల్మెట్ వినియోగం పెంచేలా కృషి చేస్తామని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఆటోలపై వాటిని అతికించారు. రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాదాలలో ఎక్కువ భాగం బైక్, ఆటోలే కారణం అవుతున్నాయని చెప్పారు.


