News August 7, 2024
బొకారో ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు
చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జి స్టేషన్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే బొకారో ఎక్స్ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. అలప్పుజ-ధన్ బాద్ బొకారో ఎక్స్ప్రెస్ను ఈనెల 8,10,13, 15,17, 20,22, 24,27,29తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా పొదనూర్,ఇరుగూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు. పొదనూర్లో హాల్ట్ కల్పించామన్నారు.
Similar News
News September 30, 2024
విశాఖ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్
ఎండాడ మహిళా పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కనకల వెంకట నరసింహమూర్తి ఈనెల 22న విధులకు వెళ్లారు. డ్యూటీ అనంతరం నరసింహమూర్తి ఇంటికి రాలేదు. అతని భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్లో ఆరా తీసి మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆదివారం నరసింహమూర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న SI వెళ్లి ఆరా తీయగా పనిఒత్తిడితో ప్రశాంతత కోసం తిరుపతి, విజయవాడ దైవ దర్శనానికి వెళ్లినట్లు అతను తెలిపాడు.
News September 30, 2024
విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it
News September 30, 2024
విశాఖ కేజీహెచ్ నుంచి విద్యార్థి పరారీ..!
డౌనూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి కే.సురేష్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొయ్యూరు ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ చొరవ తీసుకుని కేజీహెచ్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థి సోమవారం ఆసుపత్రి నుంచి పరారయ్యాడని ఏటీడబ్ల్యూవో తెలిపారు. నాటువైద్యం చేయించడానికి తల్లిదండ్రులు స్వగ్రామమైన కుడిసింగి తీసుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.